సీఏఏని అమలు చేసి తీరుతాం: కిషన్రెడ్డి
30-12-2019 17:53:36
హైదరాబాద్: ఎన్ని నిరసనలు చేసినా సీఏఏని అమలు చేసి తీరుతామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనేదే ప్రధాని మోదీ సంకల్పిస్తున్నారని తెలిపారు. అయితే ప్రజల, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని.. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సమర్థిస్తున్నారని కిషన్రెడ్డి తప్పుబట్టారు. సీఏఏపై బీజేపీ కార్యకర్తతో రాహుల్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లను నడిపించేది ఎంఐఎం మాత్రమేనని, ఎంఐఎం నేత ఒవైసీ, సీఎం కేసీఆర్ పెద్ద కుర్చీల్లో కూర్చుని, మంత్రి మహమూద్ అలీని పనికిరాని కుర్చీలో కూర్చోబెట్టారని ఎద్దేవాచేశారు. సీఏఏతో భారతీయులకు సంబంధం లేదని, భారతీయ ముస్లింలకు సీఏఏతో నష్టం జరగదని తెలిపారు. చొరబాటు దారులు వేరు.. శరణార్థులు వేరని కిషన్రెడ్డి చెప్పారు.
30-12-2019 17:53:36
హైదరాబాద్: ఎన్ని నిరసనలు చేసినా సీఏఏని అమలు చేసి తీరుతామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనేదే ప్రధాని మోదీ సంకల్పిస్తున్నారని తెలిపారు. అయితే ప్రజల, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని.. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సమర్థిస్తున్నారని కిషన్రెడ్డి తప్పుబట్టారు. సీఏఏపై బీజేపీ కార్యకర్తతో రాహుల్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లను నడిపించేది ఎంఐఎం మాత్రమేనని, ఎంఐఎం నేత ఒవైసీ, సీఎం కేసీఆర్ పెద్ద కుర్చీల్లో కూర్చుని, మంత్రి మహమూద్ అలీని పనికిరాని కుర్చీలో కూర్చోబెట్టారని ఎద్దేవాచేశారు. సీఏఏతో భారతీయులకు సంబంధం లేదని, భారతీయ ముస్లింలకు సీఏఏతో నష్టం జరగదని తెలిపారు. చొరబాటు దారులు వేరు.. శరణార్థులు వేరని కిషన్రెడ్డి చెప్పారు.