Tuesday, February 15, 2022

రేవంత్‌రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ ఇద్దరూ కలిశారు..!

 ఆ ఇద్దరూ కలిశారు..! అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750

కోమటిరెడ్డి ఇంటికెళ్లిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

సమస్యలపై ఐక్యంగా పోరాడతాం: కోమటిరెడ్డి

పీకే ప్లాన్‌ అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌: రేవంత్‌



PauseUnmute

Fullscreen

VDO.AI

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఇద్దరూ కాంగ్రెస్‌ నేతలే.. ఒకరు పార్టీలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎంపీ. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. మరొకరేమో వేరే పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరి.. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అనూహ్యంగా పీసీసీ అధ్యక్ష పదవినీ పొందిన రేవంత్‌రెడ్డి. ఇద్దరూ కాంగ్రె్‌సలో కీలక నేతలే. కానీ, రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా ముఖంగానే తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. పీసీసీ అధ్యక్షుడైన తర్వాత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యనేతలందరినీ వారి ఇళ్లకు వెళ్లి మరీ కలిశారు. కానీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విముఖత వ్యక్తం చేయడంతో ఆయన్ను కలిసే ప్రయత్నం చేయలేదు.  కోమటిరెడ్డి సోదరులు బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం జరగ్గా.. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి తిరిగి దగ్గరయ్యారు. తాజాగా భువనగిరి కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌తో ఆయన సన్నిహితంగా మెలగడంపై పార్టీలో విమర్శలు వచ్చాయి. దీంతో తాను పార్టీని వీడేది లేదంటూ వెంకట్‌రెడ్డి మరోసారి వివరణ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం రేవంత్‌రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనతో భేటీ అయ్యారు.

ఎడమొహం, పెడమొహంగా ఉన్న వీరిద్దరూ హఠాత్తుగా భేటీ కావడం పార్టీలో ఆసక్తిని రేకెత్తించింది. కోమటిరెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఏయే అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి? తదితర అంశాలపై వారు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తాము కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రేవంత్‌, కోమటిరెడ్డిలు తమ మధ్య విభేదాల్లేవంటూ ఈ భేటీ ద్వారా పార్టీ శ్రేణులకు చెప్పే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కలిసి పనిచేస్తాం: కోమటిరెడ్డికాంగ్రెస్‌ పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తాను, రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఐక్యంగానే పోరాడుతుందన్నారు. పార్టీ అంతర్గత విషయాలతో పాటు భవిష్యత్తులో ఏం చేయాలన్నదానిపైనా చర్చించినట్లు చెప్పారు. నిరుద్యోగులు, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని అన్నారు. భువనగిరి సభలో తాను మాట్లాడతానంటే కేసీఆర్‌ మైక్‌ ఇవ్వలేదన్నారు. రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని కొనియాడారు. ‘ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ లాంటి త్యాగం వెంకన్నది’ అని చెప్పారు. కోమటిరెడ్డ్డితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన రేవంత్‌.. ‘హ్యాపీ టైమ్స్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

కేసీఆర్‌.. మోదీ కోవర్టు: రేవంత్‌కేసీఆర్‌ ప్రధాని మోదీ కోవర్టని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఫ్రంట్‌ పేరుతో టెంట్‌ వేసి.. కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీని బలహీనపరచాలంటే బీజేపీ భాగస్వామ్య పక్షాలను బలహీన పరచాలన్నారు. కానీ, కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలతోనే ఎందుకు చర్చలు జరుపుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రె్‌సపై సానుభూతి ఉన్నట్లు నటిస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్‌ శ్రేణులు కేసీఆర్‌ను నమ్మొద్దని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని కేసీఆర్‌ అనేక సార్లు మోసం చేశారని, కేసీఆర్‌ కుటుంబం కాంగ్రెస్‌ నేతల ఇళ్లకు వచ్చినా దగ్గరికి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌ను కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. రాహుల్‌ గాంధీపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంతపై రాష్ట్ర వ్యాప్తంగా తాము పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే.. ఏ ఒక్క చోటా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆరోపించారు. 

మోదీ తీరుపై మీ నాయకుడు మౌనంగా ఎందుకున్నారు?ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్‌ ప్రశ్న ‘‘మొసలి కన్నీరు కార్చడంలో మీ నాయకత్వానికి అత్యంత ప్రావీణ్యం ఉంది. కానీ.. తెలంగాణ తల్లిని, అమరవీరుల త్యాగాలను ప్రధాని మోదీ అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు?’’ అంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు కూడా నిలదీస్తున్నారన్నారు. కవిత చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ రేవంత్‌రెడ్డి ఈ విమర్శలు చేశారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. టీఆర్‌ఎ్‌సను విమర్శిస్తూ చేసిన ట్వీట్‌కు కవిత కౌంటర్‌ ఇచ్చారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని అవమానించేలా బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ తప్పు పట్టారని, హుందాతో కూడిన రాజకీయాలను ఆయన కోరుకుంటారని అన్నారు. కవిత చేసిన ఈ ట్వీట్‌నే రీట్వీట్‌ చేస్తూ మంగళవారం రేవంత్‌రెడ్డి ఈ మేరకు స్పందించారు.

Monday, February 14, 2022

తెలంగాణకేసీఆర్‌ దూకుడు మర్మమేంటో!

 తెలంగాణకేసీఆర్‌ దూకుడు మర్మమేంటో!

Feb 15 2022 @ 01:50AMహోం


కర్ణాటకతో పాటే వచ్చే ఏడాది మే లోపు ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన

అక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే ఇక్కడ ఆ పార్టీకి అనుకూల పరిస్థితులుంటాయని అంచనా

 టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ముక్కోణపోటీ

మళ్లీ అధికారమే కేసీఆర్‌ వ్యాఖ్యల లక్ష్యం!

టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ

కర్ణాటకతో పాటే వచ్చే ఏడాది మే లోపు ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన.. 

 మళ్లీ అధికారమే కేసీఆర్‌ వ్యాఖ్యల లక్ష్యం

 టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ


హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వరుస మీడియా సమావేశాలు, బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దూకుడు పెంచినా.. కాంగ్రె్‌సతో సంబంధం లేదంటూనే ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీకి అనూహ్యంగా మద్దతు పలికినా.. ఆయన రాజకీయ వ్యూహంలో భాగమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యాఖ్యలన్నీ ఆయన దూరదృష్టితో చేస్తున్నవేనని అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని నిలబెట్టడం.. అంటే, వరుసగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా సీఎం కార్యాచరణను చూడాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు కొందరు విశ్లేషిస్తున్నారు.

మళ్లీ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేయడం, టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌స-బీజేపీ మధ్య ముక్కోణ పోటీ కోరుకోవడం తమ అధినేత ప్రస్తుత ఎత్తుగడల వెనుక వ్యూహం కావచ్చని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడకుండా చూడటం కేసీఆర్‌ లక్ష్యాల్లో ముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి.

కర్ణాటక అసెంబ్లీతోపాటు.. కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం 2023 మే 24న ముగుస్తుంది. ఆ ఎన్నికలతోపాటే తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు చాలామంది టీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కంటే, విపక్ష కాంగ్రె్‌సకు అనుకూల పరిస్థితులున్నాయని వారు అంచనా వేస్తున్నారు. అది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నాటికి పెరిగి, ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తే.. ఆ ప్రభావం పొరుగు రాష్ట్రమైన మనపైనా (తెలంగాణపై) పడుతుందని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అన్ని రకాలుగా బలం చేకూరుతుందని, ఇది తమకు నష్టం చేస్తుందని వారు అంటున్నారు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలంటే, కర్ణాటక అసెంబ్లీతోపాటు, తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలని టీఆర్‌ఎస్‌ వర్గాలు కోరుకుంటున్నాయి.

వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం 2024, జనవరి 16న ముగుస్తుంది. అంతకంటే ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చు. ఈ నేపథ్యంలో.. ‘‘కర్ణాటక అసెంబ్లీతోపాటు ఇక్కడా ఎన్నికలు రావాలంటే ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో ఇక్కడ అసెంబ్లీని రద్దు చేయాలి. ఏడాది పదవీకాలాన్ని వదులుకోవాలి. అప్పుడే ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పోటీని నివారించగలుగుతాం’’ అని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు.

అయితే.. ‘‘మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే, అందుకు కారణాలను ప్రజలకు చెప్పడంలో సఫలీకృతులం కావాలి. ఇందులో విఫలమైతే మాత్రం, మొదటికే మోసం రావచ్చు’ అనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతోంది. పైగా కేంద్రంలోని బీజేపీ సర్కారుతో రాజకీయ యుద్ధానికి దిగడం, స్వయంగా ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే, వారి నుంచి ఇదివరకటి సహకారం ఉంటుందని ఊహించలేమని.. అసెంబ్లీని రద్దు చేశాక కేంద్రం ఉద్దేశపూర్వకంగా గవర్నర్‌ పాలన తెస్తే, కొత్త తలనొప్పులు తప్పవని వారు అంటున్నారు.

బీజేపీ బలం పెరిగితేనే..తాము ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినా, వెళ్లకపోయినా.. రాష్ట్రంలో బీజేపీ బలపడితేనే తమకు రాజకీయంగా లాభమని అధికార పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనివల్ల టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌స-బీజేపీ మధ్య ముక్కోణ పోటీ జరిగి అంతిమంగా తమకు ప్రయోజనం కలుగుతుందని, మళ్లీ అధికారంలోకి రాగలుగుతామని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎనిమిదేళ్ల నుంచి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత సహజమని.. ఆ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా ఒకే పార్టీకి, అదీ కాంగ్రె్‌సకు పడకుండా, బీజేపీ కూడా వ్యతిరేక ఓట్లను భారీగా పొందాలనేది తమ వ్యూహమని వివరిస్తున్నాయి.

‘‘తెలంగాణలో బతికిచెడ్డ కాంగ్రె్‌సకు ఇంకా ఓటు బ్యాంక్‌ ఉంది. అది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేకతతో పుంజుకోవద్దు. కాంగ్రెస్‌ మా సమీపంలోకి రాకుండా ఉండాలంటే, బీజేపీ బలంగా మారాలి’’ అని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు. ఈ కోణంలోనే రాష్ట్రంలో బీజేపీతోనే తమకు పోటీ అన్నట్లుగా తమ అధినేత విమర్శలు ఉంటున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. ‘‘బీజేపీ ఓటు బ్యాంక్‌ రాష్ట్ర స్థాయిలో సింగిల్‌ డిజిట్‌ దాటదు. ఆ పార్టీకి సరైన అభ్యర్థులు కూడా లేరు. అటువంటి బీజేపీని టార్గెట్‌గా చేసుకోవడం వల్ల దానికి పెరిగే ఓట్లు, కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అవుతాయి. బీజేపీ బలంగా మారకపోతే, ఆ ఓట్లు కాంగ్రె్‌సకి వెళ్తాయి. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు’’ అనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతోంది. 

రాహుల్‌కు అండగా అందుకే..కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి బీజేపీ సీఎం హిమంత విశ్వశర్మ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ తప్పుపట్టడం వెనుక కూడా రాజకీయ వ్యూహం ఉందని చెబుతున్నారు. రాహుల్‌గాంధీ, ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్‌ అండగా నిలవడం ఆలస్యం.. ‘వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌స-కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయి’ అనే వాదనను బీజేపీ తెరపైకి తెచ్చింది. ఇది నిజమా? కాదా? అనేది ఇప్పటికిప్పుడు తేలదుగానీ.. ఈ ప్రచారం కాంగ్రె్‌సకు రాజకీయంగా నష్టం చేస్తుందని, తమకు లాభం చేస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ కాంగ్రె్‌సకు అనుకూలంగా మాట్లాడటం వల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసినా, టీఆర్‌ఎ్‌సకి ఓటు వేసినా ఒకటేననే అభిప్రాయం కలుగుతుందని, అప్పుడు కాంగ్రె్‌సకి పడే ఓట్లు తమకే పడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. అయితే.. ప్రస్తుతానికి రాజకీయంగా అంతగా బలంగా లేని బీజేపీని ప్రధాన శత్రువుగా చిత్రీకరించి యుద్ధం చేయడం, తమ వనరులు, శక్తిని ఆ పార్టీపై వెచ్చించడం ఎంతవరకు సబబనే ప్రశ్న కూడా టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. బీజేపీ సర్కారు రాఫెల్‌, అమెరికా ఎన్నికల వంటి విషయాల్లో తప్పు చేసినప్పటికీ.. అవి జరిగినప్పుడు కాకుండా, ఇప్పుడు వేలెత్తిచూపటంపై  సాధారణ జనం వ్యక్తం చేస్తున్న సందేహాలకు తమ వద్ద జవాబు లేదని టీఆర్‌ఎస్‌ నేతలు కొందరు చెబుతున్నారు.

జాతీయస్థాయిలో కీలకపాత్ర సాధ్యమా?రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటితోనే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించటం సాధ్యమా అనే ప్రశ్న పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ కేంద్రంలో కీలకంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరిన సంగతి తెలిసిందే. కానీ, అప్పుడు పరిస్థితులు కలిసిరాలేదు. పూర్తిస్థాయి మెజారిటీ సాధించిన బీజేపీకి ఇతర పార్టీల అవసరం రాలేదు. రాష్ట్రంలో 16 చోట్ల గెలుస్తామని భావించిన టీఆర్‌ఎస్‌ తొమ్మిది స్థానాలకే పరిమితమైంది.

ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు కాలు దువ్వుతుండడంపై పార్టీ వర్గాల్లో సానుకూలత వ్యక్తం కావట్లేదని టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు చెబుతున్నారు. ‘‘జాతీయ పార్టీ పెట్టి ఉత్తరాదిలో మద్దతు పొందడం, కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడం అంత సులువు కాదు. ఒకవేళ తీసుకు వచ్చినా.. నాయకత్వ బాధ్యతల సమస్య తలెత్తుతుంది. అన్నింటికీ మించి.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలనూ టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని చెప్పలేం. తక్కువ స్థానాల్లో గెలిచి, కేంద్రంలో చక్రం తిప్పటం వీలుకాకపోచ్చు’’ అని విశ్లేషకులు అంటున్నారు. 

యూపీ ఎన్నికల తర్వాతే స్పష్టత..సీఎం కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలు అనూహ్యంగా ఉంటాయని, పూర్తిస్థాయిలో అంచనా వేయలేమని చాలా మంది టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు ఆయనగా లీకులు ఇవ్వాలని భావిస్తే తప్ప.. ఆయన మదిలో ఏమున్నదో తెలుసుకోవటం అసాధ్యమని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్‌ మాటల వెనుక మర్మంపై స్పష్టత రావచ్చని అంటున్నారు.