21న విపక్షాల భేటీ!
Thu,May 9, 2019 03:26 AM
Andhra CM Rahul Gandhi discusses plans to call Oppn meet on May 21
-ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా తమనే ఆహ్వానించేలా ప్రణాళిక
-ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రపతిని కలువాలని నిర్ణయం
-రాహుల్గాంధీని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు
న్యూఢిల్లీ, మే 8: ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 21న సమావేశం కానున్నాయి. ఈ నెల 23న ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా చర్చించనున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముందుగా తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాయి. 21నాటి సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీని కలిశారు. ఫలితాల వెల్లడికి రెండు రోజుల ముందు ఈ నెల 21న ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా వారిద్దరూ వీవీప్యాట్ల లెక్కింపు, ఇటీవలి ఎన్నికల్ల పోలింగ్ శాతం, ఆంధ్రప్రదేశ్లో జరగుతున్న పరిణామాలు.. తదితర అంశాలపై చర్చించారు. అదేవిధంగా పోలింగ్ అంనంతరం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
ప్రతిపక్షాల సమావేశానికి రావాల్సిందిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరేందుకు చద్రబాబు గురువారం పశ్చిమబెంగాల్ వెళ్లనున్నారు. మరోవైపు ఫలితాలు వెలువడిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిపక్ష కూటమి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలువాలని భావిస్తున్నది. మెజార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలని కోరనున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రతిపక్ష పార్టీలు కొన్నాళ్లుగా సమిష్టిగా బీజేపీపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీవీప్యాట్ల లెక్కింపుపై తీర్పును సమీక్షించాలంటూ 21 పార్టీల కూటమి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును మార్చేది లేదంటూ మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసిన వెంటనే.. 22 పార్టీల ప్రతినిధులు ఎన్నికల కమిషన్ను కలిశారు.
సాధ్యమేనా?
మెజార్టీతో సంబంధం లేకుండా తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న ప్రతిపక్షాల ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫలితాల వెల్లడి అనంతరం ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలో రాష్ట్రపతే నిర్ణయిస్తారు. ఆయనకు మాత్రమే విచక్షణ అధికారం ఉన్నది. ఇప్పటివరకు కేంద్రంలో పలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీని మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇటీవలి పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ సంప్రదాయానికి గండికొట్టింది. గోవా, మణిపూర్లలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ ఆయా రాష్ర్టాల గవర్నర్లు కాంగ్రెస్ను కాకుండా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా ఉండి కర్ణాటకను మాత్రం దక్కించుకోగలిగాయి ఈ మూడు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఫలితాలు వెల్లడైన వెంటనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలువాలని నిర్ణయించాయి.
Akhilesh-Yadav
బీజేపీ నాయకులకు నిద్రలేదు!
-ప్రధానికి మంచి రోజులు ముగిశాయి: మాయావతి
-కుర్చీని లాగొద్దని మోదీ ఓటర్లకు మొరపెట్టుకుంటున్నారు: అఖిలేశ్
ఆజంగఢ్ (యూపీ), మే 8: లోక్సభ ఎన్నికల్లో గెలుపు ధీమాతో అధికార, విపక్షాలు తమ పార్టీ ప్రచారాలను కొనసాగిస్తున్నాయి. రానున్న రెండు విడుతల లోక్సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికార బీజేపీ నేతలు ఇటీవల ప్రకటించడాన్ని ఉత్తర్ప్రదేశ్లోని బీఎస్పీ - ఎస్పీ - ఆర్ఎల్డీ కూటమి నాయకులు ఎద్దేవా చేశారు. ఆజంగఢ్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. చివరి రెండు విడుతల ఎన్నికల్లో మా కూటమి విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. మహాకూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నాయకులకు నిద్రలేదు అని పేర్కొన్నారు. కూటమి ఆజంగఢ్ అభ్యర్థి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ఎద్దేవా చేస్తున్నట్టుగా తమది కల్తీ కూటమి కాదని, ఆయనే కల్తీ వ్యక్తి అని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాణేనికున్న రెండు ముఖాలని, వాటి స్వభావం, గుణం ఒకటేనని దుయ్యబట్టారు. మోదీకి మంచి రోజులు ముగిశాయని, ఓటమి భయం ఆయన ముఖంలోనే కనిపిస్తున్నదని తెలిపారు. ఓటర్లు మహాకూటమికి బాసటగా నిలిచారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చాయ్వాలాగా వచ్చి, చౌకీదార్గా మారిన మోదీ తన కుర్చీని లాగొద్దని ఓటర్లను అడుక్కుంటున్నారని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మంత్రి పదవికి తాను మాయావతికి మద్దతునిస్తానని, అలాగే యూపీ సీఎం పదవికి ఆమె తనకు మద్దతుగా ఉంటారని చెప్పారు.
Thu,May 9, 2019 03:26 AM
Andhra CM Rahul Gandhi discusses plans to call Oppn meet on May 21
-ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా తమనే ఆహ్వానించేలా ప్రణాళిక
-ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రపతిని కలువాలని నిర్ణయం
-రాహుల్గాంధీని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు
న్యూఢిల్లీ, మే 8: ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 21న సమావేశం కానున్నాయి. ఈ నెల 23న ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా చర్చించనున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముందుగా తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాయి. 21నాటి సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండా అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీని కలిశారు. ఫలితాల వెల్లడికి రెండు రోజుల ముందు ఈ నెల 21న ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా వారిద్దరూ వీవీప్యాట్ల లెక్కింపు, ఇటీవలి ఎన్నికల్ల పోలింగ్ శాతం, ఆంధ్రప్రదేశ్లో జరగుతున్న పరిణామాలు.. తదితర అంశాలపై చర్చించారు. అదేవిధంగా పోలింగ్ అంనంతరం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
ప్రతిపక్షాల సమావేశానికి రావాల్సిందిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరేందుకు చద్రబాబు గురువారం పశ్చిమబెంగాల్ వెళ్లనున్నారు. మరోవైపు ఫలితాలు వెలువడిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిపక్ష కూటమి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలువాలని భావిస్తున్నది. మెజార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలని కోరనున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రతిపక్ష పార్టీలు కొన్నాళ్లుగా సమిష్టిగా బీజేపీపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీవీప్యాట్ల లెక్కింపుపై తీర్పును సమీక్షించాలంటూ 21 పార్టీల కూటమి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును మార్చేది లేదంటూ మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసిన వెంటనే.. 22 పార్టీల ప్రతినిధులు ఎన్నికల కమిషన్ను కలిశారు.
సాధ్యమేనా?
మెజార్టీతో సంబంధం లేకుండా తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న ప్రతిపక్షాల ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫలితాల వెల్లడి అనంతరం ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలో రాష్ట్రపతే నిర్ణయిస్తారు. ఆయనకు మాత్రమే విచక్షణ అధికారం ఉన్నది. ఇప్పటివరకు కేంద్రంలో పలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీని మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇటీవలి పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ సంప్రదాయానికి గండికొట్టింది. గోవా, మణిపూర్లలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ ఆయా రాష్ర్టాల గవర్నర్లు కాంగ్రెస్ను కాకుండా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా ఉండి కర్ణాటకను మాత్రం దక్కించుకోగలిగాయి ఈ మూడు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఫలితాలు వెల్లడైన వెంటనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలువాలని నిర్ణయించాయి.
Akhilesh-Yadav
బీజేపీ నాయకులకు నిద్రలేదు!
-ప్రధానికి మంచి రోజులు ముగిశాయి: మాయావతి
-కుర్చీని లాగొద్దని మోదీ ఓటర్లకు మొరపెట్టుకుంటున్నారు: అఖిలేశ్
ఆజంగఢ్ (యూపీ), మే 8: లోక్సభ ఎన్నికల్లో గెలుపు ధీమాతో అధికార, విపక్షాలు తమ పార్టీ ప్రచారాలను కొనసాగిస్తున్నాయి. రానున్న రెండు విడుతల లోక్సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికార బీజేపీ నేతలు ఇటీవల ప్రకటించడాన్ని ఉత్తర్ప్రదేశ్లోని బీఎస్పీ - ఎస్పీ - ఆర్ఎల్డీ కూటమి నాయకులు ఎద్దేవా చేశారు. ఆజంగఢ్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. చివరి రెండు విడుతల ఎన్నికల్లో మా కూటమి విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. మహాకూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నాయకులకు నిద్రలేదు అని పేర్కొన్నారు. కూటమి ఆజంగఢ్ అభ్యర్థి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ఎద్దేవా చేస్తున్నట్టుగా తమది కల్తీ కూటమి కాదని, ఆయనే కల్తీ వ్యక్తి అని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాణేనికున్న రెండు ముఖాలని, వాటి స్వభావం, గుణం ఒకటేనని దుయ్యబట్టారు. మోదీకి మంచి రోజులు ముగిశాయని, ఓటమి భయం ఆయన ముఖంలోనే కనిపిస్తున్నదని తెలిపారు. ఓటర్లు మహాకూటమికి బాసటగా నిలిచారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చాయ్వాలాగా వచ్చి, చౌకీదార్గా మారిన మోదీ తన కుర్చీని లాగొద్దని ఓటర్లను అడుక్కుంటున్నారని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మంత్రి పదవికి తాను మాయావతికి మద్దతునిస్తానని, అలాగే యూపీ సీఎం పదవికి ఆమె తనకు మద్దతుగా ఉంటారని చెప్పారు.