Thursday, May 9, 2019

కలాం సమాధిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

కలాం సమాధిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
Thu,May 9, 2019 08:50 PM
cmkcr visits Dr Abdul Kalam Memorial in rameshwaram

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని దర్శించుకున్నారు. అబ్దుల్ కలాంకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అబ్దుల్ కలాంకు సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మెమోరియల్ లో ఏర్పాటు చేసిన ఫొటోగ్యాలరీని సీఎం వీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ, తమిళనాడు పర్యటనలో భాగంగా..ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ తో సమావేశమైన విషయం తెలిసిందే. దేశ రాజకీయాలతో పాటు లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.






No comments:

Post a Comment